న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజాలు వీరేందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. ఈనెల 20న ఒమన్ వేదికగా ప్రారంభం కానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ)లో ఈ ముగ్గురు ‘ఇండియా మహారాజా’ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. దిగ్గజ క్రికెటర్లందరినీ కలిపి తొలిసారి నిర్వహిస్తున్న లెజెండ్స్ లీగ్లో మొత్తం మూడు జట్లు ఇండియా మహారాజా, ఆసియా లయన్స్, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ పోటీ పడుతున్నాయి. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ఈ లీగ్ కమిషనర్గా వ్యవహరిస్తున్నాడు.