పార్ల్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండవ వన్డేలో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా నెమ్మదిగా స్కోర్ బోర్డును పరుగెత్తిస్తోంది. మూడవ వికెట్కు రాహుల్, రిషబ్లు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 43 బంతుల్లో ఏడు ఫోర్లు, ఓ సిక్సర్తో పంత్ అర్థశతకం పూర్తి చేశాడు. వన్డేల్లో అతనికి ఇది నాలుగవ హాఫ్ సెంచరీ. ఇండియా 25 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 141 రన్స్ చేసింది.