దుబాయ్: స్కాట్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో పటిష్ట న్యూజిల్యాండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. భారత్తో జరిగిన మ్యాచ్లో ఛేజింగ్ను ముందుండి నడిపించిన ఓపెనర్ డారియల్ మిచెల్ (13) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. సఫ్యాన్ షరీఫ్ వేసిన బంతి డారియల్ బ్యాట్ను తప్పించుకొని ప్యాడ్స్ను తాకింది.
అతను రివ్యూ కోరినా ఫలితం మాత్రం మారలేదు. అదే ఓవర్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (0)ను కూడా పెవిలియన్ చేర్చిన షంసీ జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. దీంతో 5 ఓవర్లు ముగిసేసరికి న్యూజిల్యాండ్ జట్టు స్కోరు 35/2గా ఉంది.