గ్రేటర్ నోయిడా : మహిళల సీనియర్ జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో జాస్మిన్ లంబోరియా, అరుంధతి, స్వీటీ బూర పసిడి పతకాలతో మెరిశారు. బుధవారం జరిగిన 60కిలోల ఫైనల్ పోరులో జాస్మిన్ 4-3తో ఒలింపియన్ సిమ్రన్జీత్కౌర్పై విజయం సాధించింది.
వాస్తవానికి బౌట్ ఆసాంతం సిమ్రన్జీత్ ఆధిపత్యం ప్రదర్శించినా..రిఫరీలు మాత్రం జాస్మిన్ వైపు మొగ్గుచూపారు. దీనిపై మాజీ ఆసియా చాంపియన్ సిమ్రన్జీత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 66కిలోల విభాగంలో అరుంధతి 5-0తో అంక్షిత బొరోపై విజయం సాధించింది. ప్రపంచ చాంపియన్ స్వీటి బూర(81కి)..పూజరాణిపై గెలిచి తన టైటిల్ నిలబెట్టుకుంది.