న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ మూడో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ నిర్వహించగా.. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఇప్పటికే రెండు వన్డేలు పూర్తవగా రెండింటిలోనూ సౌతాఫ్రికా విజయం సాధించింది. దాంతో ఈ వన్డేలో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భారత్ కసి మీద ఉన్నది. అదే సమయంలో భారత్ను మూడో వన్డేలోనూ ఓడించి సిరీస్ను క్లీన్ స్వీస్ చేయాలని సౌతాఫ్రికా ఉవ్విళ్లూరుతున్నది.