కోల్కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ సోకిందని వైద్యులు తెలిపారు. రెండు రోజుల కిందట సేకరించిన శాంపిల్స్లో దాదాకు డెల్టా ప్లస్ నిర్ధారణ అయ్యిందని శనివారం తేలింది. సోమవారం నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ టెస్టులో దాదాకు పాజిటివ్ రాగా.. దవాఖానాలో నాలుగు రోజులపాటు చికిత్స పొంది శుక్రవారం ఇంటికి చేరాడు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్న గంగూలీని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ‘రెండు రోజుల కిందట తీసుకున్న శాంపిల్స్లో డెల్టా ప్లస్ వేరియంట్ వచ్చిందని పరీక్షల్లో తెలిసింది. దానికి సంబంధించిన చికిత్స అందిస్తున్నాం’ అని వైద్యులు తెలిపారు. అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.