కోల్కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా బారినపడ్డాడు. ప్రస్తుతం కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం కరోనా లక్షణాలు బయటపడడంతో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అతడిని వెంటనే దవాఖానలో చేర్పించారు. ‘ ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. గంగూలీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు’ అని ఆస్పత్రి ఎండీ, సీఈవో డాక్టర్ రుపాలీ బసు తెలిపారు. డబుల్ వ్యాక్సిన్ పొందిన దాదా ఈ ఏడాది ప్రారంభంలో యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి వైద్యులు గంగూలీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.