Ranji trophy| ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ – 2023 టైటిల్ను రెండోసారి సౌరాష్ట్ర సొంతం చేసుకుంది. ఆదివారం బెంగాల్తో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో జైదేవ్ ఉనాద్కత్ కెప్టెన్సీలోని సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 174 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ దిగిన సౌరాష్ట్ర 404 పరుగులు చేసింది. ఈ క్రమంలో 164/4తో నాలుగో రోజు అదివారం ఆట కొనసాగించిన బెంగాల్ రెండో ఇన్నింగ్స్ లో 241 పరుగులకే కుప్పకూలి.. సౌరాష్ట్రకు 14 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ 14 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర 2.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి ఛేదించి రంజీ ట్రోఫీ చేజిక్కించుకుంది.
బెంగాల్ బ్యాటర్లలో కెప్టెన్ మనోజ్ తివారి (68), అనుస్తుప్ మజుందార్ (61) మాత్రమే రాణించారు. ముకేశ్ 4, ఇషాన్ పొరెల్, అక్ష్దీప్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. సౌరాష్ట్ర బ్యాటర్లలో అర్పిత్ (81), చిరాగ్ జానీ (60) రాణించగా.. ఉనద్కత్ ఆరు, చేతన్ సకారియా మూడు వికెట్లు పడగొట్టారు. ఉనద్కత్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
రంజీలలో సౌరాష్ట్రకు ఇది రెండో ట్రోఫీ. గతంలో 2019–20 సీజన్లో సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. రంజీలలో ఇది బెంగాల్కు 15వ ఫైనల్ కాగా.. 14 సార్లు రన్నరప్గానే నిలిచింది.
That Winning Feeling 🏆 😊
Congratulations to the @JUnadkat-led Saurashtra on their #RanjiTrophy title triumph 🙌 🙌 #BENvSAU | #Final | @saucricket | @mastercardindia
Scorecard 👉 https://t.co/hwbkaDeBSj pic.twitter.com/m2PQKqsPOG
— BCCI Domestic (@BCCIdomestic) February 19, 2023