బెంగళూరు: ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర, బెంగాల్ ఫైనల్కు దూసుకెళ్లాయి. కర్ణాటకతో జరిగిన సెమీఫైనల్లో సౌరాష్ట్ర 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులు చేయగా.. సౌరాష్ట్ర 527 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో కర్ణాటక 234 పరుగులకు ఆలౌట్ కాగా.. 115 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్లో 202, రెండో ఇన్నింగ్స్లో 47* పరుగులు చేసిన సౌరాష్ట్ర కెప్టెన్ అర్పిత్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మరో సెమీస్లో బెంగాల్ 306 పరుగుల భారీ తేడాతో మధ్యప్రదేశ్పై గెలుపొందింది. బెంగాల్ తొలుత 438 పరుగులు చేయగా.. బదులుగా మధ్యప్రదేశ్ 170 రన్స్కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో బెంగాల్ 279 పరుగులు చేసి 548 పరుగుల లక్ష్యాన్ని మధ్యప్రదేశ్ ముందుంచగా.. ఆ జట్టు 241 పరుగులకు పరిమితమైంది.