ఇందూరు, మార్చి 23: ఉజ్బెకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్న భారత సీనియర్ మహిళల జట్టులో నిజామాబాద్ అమ్మాయి గుగులోత్ సౌమ్య కు చోటు దక్కింది. ఈనెల 26 నుంచి ఏప్రిల్ 8 వరకు అక్కడ జరిగే అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ల కోసం 23 మంది ప్లేయర్లతో కూడిన భారత జట్టును జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) మంగళవారం ప్రకటించింది. 2022 ఏఎఫ్సీ మహిళల ఆసియా కప్ సన్నాహకాల్లో భాగమైన ఈ మ్యాచ్లకు ఇందూరు డిఫెండర్ సౌమ్యను ఎంపిక చేసింది.