Korea Open 2023 | న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి.. కొరియా ఓపెన్ ఫైనల్కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్-చిరాగ్ జంట 21-15, 24-22తో రెండో సీడ్ లియాంగ్-వాంగ్ చాంగ్ (చైనా) ద్వయంపై గెలుపొందింది.
గత నెలలో ఇండోనేషియా సూపర్-1000 టైటిల్ నెగ్గిన అనంతరం బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే మనవాళ్లు దుమ్మురేపారు. 40 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రపంచ మూడో ర్యాంక్ జోడీ వరుస గేమ్ల్లో ప్రత్యర్థిని మట్టకరిపించింది. తెలుగు కుర్రాడు సాత్విక్ తన సూపర్ స్మాష్లతో సత్తాచాటాడు. ఆదివారం జరుగనున్న ఫైనల్లో ఫజర్ అల్ఫాన్- రియాన్ జంటతో భారత జోడీ అమీతుమీ తేల్చుకోనుంది.