Satwik-Chirag : భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు సాత్విక్సాయిరాజు రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలు కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్ సాధించారు. ఏడాది కాలంగా అదరగొడుతున్న ఈ జంట పురుషుల డబుల్స్ విభాగంలో 5వ స్థానం సొంతం చేసుకున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ సంస్థ (BWF ) వరల్డ్ ర్యాకింగ్స్ను మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది డబుల్స్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సాత్విక్-చిరాగ్ జోడీ 75,806 పాయింట్లతో 5వ ర్యాంకు దక్కించుకుంది. భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ సింగిల్స్లో టాప్ 10లో చోటు సంపాదించాడు. ఇంతకు ముందు 11వ ప్లేస్లో ఉన్న అతను రెండు ర్యాంకులు ఎగబాకి 9వ స్థానానికి చేరాడు. విశేషం ఏంటంటే.. ఈ ఏడాది ప్రారంభంలో అతను 26వ ప్లేస్లో ఉన్నాడు. ఒలింపిక్ విజేత పీవీ సింధు మహిళల విభాగంలో 6వ ర్యాంకులో ఉంది.
సాత్విక్-చిరాగ్ జోడీ ఈ ఏడాది ఇండియా ఓపెన్ సూపర్ 500 టోర్నీలో టైటిళ్లు సాధించింది. ఈ జంట ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ను తొలిసారిగా గెలిచింది. వీళ్లిద్దరూ థామస్ కప్ అందుకున్న జట్టులో సభ్యులు కూడా. అంతేకాదు సాత్విక్-చిరాగ్లు కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకం, వరల్డ్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించారు.