టోక్యో: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. తద్వారా ఈ మెగాటోర్నీ పురుషుల డబుల్స్లో పతకం గెలిచిన తొలి భారత షట్లర్లుగా రికార్డుల్లోకెక్కారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ 22-20, 18-21, 16-21తో ఆరోన్-సోహ్ యిక్ (మలేషియా) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. 77 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో తొలి గేమ్ నెగ్గిన భారత జంట.. ఆ తర్వాత వరుసగా రెండు గేమ్లు కోల్పోయింది. కామన్వెల్త్ గేమ్స్ టీమ్ చాంపియన్షిప్లో ఇదే జోడీ చేతిలో ఓడిన సాత్విక్-చిరాగ్.. ఈసారి బదులు తీర్చుకుంటారనుకుంటే అది సాధ్య పడలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత సాత్విక్ మాట్లాడుతూ ‘మెగా టోర్నీల్లో ప్రతీసారి దురదృష్టం వెంటాడడం చికాకు అనిపిస్తున్నది. కీలకమైన మ్యాచ్ల్లో ఏదో ఒక అద్భుతం చోటు చేసుకోవాలి’ అని అన్నాడు.