French Open Super 750 | పారిస్ వేదికగా జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్లో భారత పురుషుల జోడీ సాత్విక్ – చిరాగ్లతో పాటు మహిళల ద్వయం ట్రీసా జాలీ – గాయత్రి గోపిచంద్ల జోడీ రెండో రౌండ్కు దూసుకెళ్లింది. తొలి రౌండ్లో పురుషుల జోడీ మలేషియా ప్లేయర్లను ఓడించగా.. ఉమెన్స్ పెయిర్ భారత్కే చెందిన క్రాస్టో – పొన్నప్ప లనే ఓడించింది.
పురుషుల డబుల్స్లో వరల్డ్ నెంబర్ వన్ జోడీ చిరాగ్ – సాత్విక్లు తొలి రౌండ్లో 21-13, 24-22 తేడాతో మలేషియాకు చెందిన మ్యాన్ వీ చోంగ్ – కై వున్ టీ లను ఓడించింది. గత 8 మ్యాచ్లలో మలేషియా ఆటగాళ్లతో చిరాగ్ – సాత్విక్లకు ఇది ఐదో గెలుపు.
Just in: WR 1 pair Satwik/Chirag beat WR 12 Ong Yew Sin & Teo Ee Yi 21-13, 24-22 in opening round of French Open (Super 750). #FrenchOpen pic.twitter.com/ORLhSBZ3FR
— India_AllSports (@India_AllSports) March 5, 2024
ట్రీసా – గాయత్రిల ద్వయం 16-21, 21-19, 21-17 తేడాతో తనీషా క్రాస్టో -పొన్నప్పలను ఓడించింది. తొలి రౌండ్లో ఓడినా ట్రీసా – గాయత్రిల జోడీ.. తర్వాత రెండు రౌండ్లలో పుంజుకుని విజయం సాధించింది. సింగిల్స్ ఈవెంట్స్లో భారత్ తరఫున లక్ష్యసేన్, ప్రియాన్షు రజావత్లు తొలి రౌండ్ ఆడనున్నారు.
Treesa/Gayatri beat compatriots Ashwini/Tanisha 16-21, 21-19, 21-17 in opening round of French Open (Super 750). #FrenchOpen pic.twitter.com/DzwngPmaJG
— India_AllSports (@India_AllSports) March 5, 2024