కౌలాలంపూర్: మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరు ముగిసింది. పురుషుల డబుల్స్లో సాత్విక్ -చిరాగ్ శెట్టి జంట ఓడింది. శనివారం సెమీఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ 16-21, 21-11, 15-21తో లియాంగ్ వీ కెంగ్-వాంగ్ చాంగ్ (చైనా) ద్వయం చేతిలో ఓటమి పాలైం ది. గంటా 4 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ కోల్పోయిన భారత ఆటగాళ్లు రెండో గేమ్ నెగ్గినా.. మూడో గేమ్లో ప్రభావం చూపలేకపోయారు.