నేరేడ్మెట్: ఆల్ఇండియా సబ్జూనియర్ ర్యాంకింగ్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్రెడ్డి, వైష్ణవి జోడీ టైటిల్ దక్కించుకుంది. గోవా వేదికగా గురువారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో పుల్లెల గోపీచంద్ అకాడమీకి చెందిన సాత్విక్, వైష్ణవి 17-21, 21-16, 21-16 తో విజ్జేశ్, శ్రీసాయి శ్రావ్య ద్వయంపై గెలిచి విజేతగా నిలిచింది.
తొలి గేమ్ కోల్పోయినా వరుసగా రెండు గేముల్లో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ మ్యాచ్ను కైవసం చేసుకుంది. సింగిల్స్ ఫైనల్లో ప్రణవ్ రన్నరప్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. టైటిల్ విజేతలకు కోచ్ రాజేందర్, అనిల్, అక్షయ్ ట్రోఫీలు అందజేశారు.