హైదరాబాద్ : ఇటీవల స్పెయిన్లో జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో రెండో స్థానం భారత్కు, తెలంగాణకు గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ను రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి సన్మానించారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శ్రీకాంత్ను వెంకటేశ్వర్ రెడ్డి కలిసి అభినందించారు.ఈ కార్యక్రమంలో పుల్లెల గోపీచంద్తో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.