హైదరాబాద్, ఆట ప్రతినిధి: తమిళనాడు వేదికగా జరిగిన జాతీయ మహిళల చెస్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన ప్లేయర్లు సత్తాచాటారు. రాష్ట్ర మహిళల చెస్ టీమ్ కెప్టెన్ కీర్తి, సరయు, స్నేహభారతి, యశ్విజైన్ మూడు కాంస్య పతకాలు ఖాతాలో వేసుకుని ఓవరాల్గా నాలుగో స్థానం దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా గురువారం చెస్ ప్లేయర్లను సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అభినందించారు. సాట్స్ సహకారంతో ప్లేయర్లు అద్భుత ప్రదర్శన కనబర్చడం సంతోషంగా ఉందన్నారు. మహిళల జట్టు సీడింగ్కు మించి రాణించి కాంస్య పతకాలు సొంతం చేసుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.