Satwik-Chirag | బర్మింగ్హామ్: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచి మంచి జోరుమీదున్న భారత స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి తమ పోరాటాన్ని ముగించారు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సాత్విక్, చిరాగ్ ద్వయం 16-21, 15-21తో మహమ్మద్ షోహిబుల్, బాగాస్ మౌలానా జోడీ చేతిలో ఓటమిపాలైంది.
టాప్సీడ్గా బరిలోకి దిగిన సాత్విక్, చిరాగ్..ప్రత్యర్థి జోడీపై దీటైన ఆటతీరు కనబర్చలేకపోయారు. మరోవైపు మహిళల డబుల్స్లో తనీశా క్రాస్టో, అశ్విని పొనప్ప జోడీ 21-11, 11-21, 11-21తో చైనా ద్వయం జాంగ్ షు, జెంగ్ యు చేతిలో ఓడింది.