చెన్నై: ప్రమాదకర కరోనా వైరస్పై పోరాడేందుకు భారత యువ టీటీ ప్లేయర్ సాతియాన్ జ్ఞానశేఖరన్ ముందుకొచ్చాడు. కొవిడ్-19 పోరాటంలో భాగంగా తన వంతుగా తమిళనాడు సీఎం సంక్షేమ నిధికి సాతియాన్ శుక్రవారం లక్ష రూపాయల విరాళమిచ్చాడు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా సాతియాన్ స్పందించాడు. ‘దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా చాలా మంది తమ ఆప్తులను కోల్పోవడం బాధ కల్గిస్తున్నది. ఈ క్లిష్ట సమయంలో ఒకరికొకరు సహాయంగా నిలిచి మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొవాలి. నా వంతుగా సీఎం రిలీఫ్ ఫండ్కు లక్ష రూపాయల విరాళమిస్తున్నా. తమకు తోచిన విధంగా ఇలా ఒకరికొకరు సహాయపడితే కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి నిలువరించగల్గుతాం’ అని ట్వీట్ చేశాడు.