హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న యూటీటీ జాతీయ టోర్నీలో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. గురువారం జరిగిన బాలుర అండర్-15 ఫైనల్లో సార్థక్ ఆర్య 11-9, 11-7, 11-9తో దినేశ్పై గెలిచి టైటిల్ను సొంతం చేసుకున్నాడు.
బాలికల అండర్-15 తుది పోరులో సిండ్రెలా దాస్ 12-10, 11-9, 11-7తో హాసినిపై గెలిచి ట్రోఫీ అందుకుంది. బాలుర అండర్-13 విభాగంలో ఆదిత్య దాస్ విజేతగా నిలిచాడు. అండర్-17 కేటగిరీలో మురుగున్ ముత్తు, జెన్నిఫర్ వర్గీస్ టైటిళ్లు సొంతం చేసుకున్నారు. మరోవైపు రాష్ట్ర యువ ప్యాడ్లర్ స్నేహిత్ 7-11, 11-7, 12-10, 11-9తో పయాస్జైన్ గెలిచి సెమీస్లోకి దూసుకెళ్లాడు.