Sarfaraz Ahmed : పాకిస్థాన్ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టెస్టుల్లో సెంచరీ బాదాడు. నాలుగేళ్ల తర్వాత జట్టులో చోటు సంపాదించిన అతను తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో విలువైన పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో సర్ఫరాజ్ క్రీజులోకి వచ్చాడు. 135 బంతుల్లోనే శతకం బాదాడు. సెంచరీ అనంతరం గాల్లోకి గ్రౌండ్ మీద పంచ్లు విసిరాడు. అతని సెలబ్రేషన్ వీడియోను పీసీబీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. టెస్టుల్లో సర్ఫరాజ్కు ఇది నాలుగో సెంచరీ. 118 పరుగుల వద్ద బ్రాస్వెల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అతను సెంచరీ చేయడంతో రెండో టెస్టు డ్రాగా ముగిసింది. తొలి టెస్టులో కూడా ఫలితం తేలకపోవడంతో సిరీస్ డ్రా అయింది.
తొలి టెస్టులోనూ సర్ఫరాజ్ సెంచరీ చేజార్చుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో 86, రెండో ఇన్నింగ్స్లో 78 పరుగులకు అవుట్ అయ్యాడు. రెండో టెస్టులో ఏ పొరపాటు చేయలేదు. మళ్లీ జాతీయ జట్టుకు ఆడతానని సర్ఫరాజ్ కలలో కూడా ఊహించలేదు. అయితే.. పీసీబీ అధ్యక్షుడిగా నజం సేథీ, చీఫ్ సెలక్టర్గా మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీదీ నియమితులయ్యాక అతడికి అవకాశం లభించింది. వచ్చిన ఛాన్స్ను మిస్ చేసుకోవద్దు అనుకున్నాడు. రెండు టెస్టుల్లోనూ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు అండగా నిలిచాడు.
HE’S DONE IT! 💯
A fourth-innings masterclass from @SarfarazA_54 as he brings up his 4️⃣th Test century 💪#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/Vmbh9Ti7zR
— Pakistan Cricket (@TheRealPCB) January 6, 2023