న్యూఢిల్లీ: దేశీయ ఫుట్బాల్ టోర్నీ సంతోష్ ట్రోఫీ వాయిదా పడింది. దేశంలో కరోనా ఉధృతి కారణంగా ఫిబ్రవరి 20 నుంచి కేరళలోని మలప్పురం వేదికగా జరుగాల్సిన టోర్నీని వాయిదా వేస్తున్నట్లు అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) బుధవారం ప్రకటించింది. ‘రాష్ర్టాలతో కరోనా పరిస్థితులపై చర్చించిన అనంతరం కేరళ ప్రభుత్వం సూచన మేరకు టోర్నీని వాయిదా వేస్తున్నాం’ అని ఏఐఎఫ్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక టోర్నీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.