హైదరాబాద్, ఆట ప్రతినిధి: మలేషియా వేదికగా ఈనెల 8వ తేదీ నుంచి 13 వరకు జరిగే ఆసియా, ఓషియానియా కార్ఫ్బాల్ టోర్నీకి హైదరాబాద్కు చెందిన సంతోష్కుమార్ రిఫరీగా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని తెలంగాణ కార్ఫ్బాల్ అసోసియేషన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ టోర్నీలో భారత్ సహా చైనీస్ తైపీ, ఆస్ట్రేలియా, హాంకాంగ్, చైనా, మలేషియా, న్యూజిలాండ్, జపాన్, థాయ్లాండ్, శ్రీలంక పోటీ పడుతున్నాయి.