Sania Mirza | క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (Womens premier league-WPL) త్వరలోనే ఆరంభం కానుంది. ఈ లీగ్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) ప్రత్యేక పాత్ర పోషించనున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) టీమ్కు ఆమె మెంటార్ (Mentor)గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ‘ఆర్సీబీ మహిళా జట్టు మెంటార్గా సానియా మీర్జాను స్వాగతించడం మాకు సంతోషంగా, గౌరవంగా ఉంది’ అంటూ ట్వీట్ చేసింది.
While our coaching staff handle the cricket side of things, we couldn’t think of anyone better to guide our women cricketers about excelling under pressure.
Join us in welcoming the mentor of our women's team, a champion athlete and a trailblazer! 🙌
Namaskara, Sania Mirza! 🙏 pic.twitter.com/r1qlsMQGTb
— Royal Challengers Bangalore (@RCBTweets) February 15, 2023
కాగా, ఆర్సీబీ మహిళల జట్టుకు మెంటార్గా నియమించడం పట్ల సానియా సంతోషం వ్యక్తం చేశారు. ‘ఆర్సీబీ మహిళల జట్టులో మెంటార్గా చేరడం చాలా ఆనందంగా ఉంది. విమెన్స్ ప్రీమియర్ లీగ్తో భారత మహిళల క్రికెట్ ఎంతో మార్పును చూడబోతోంది. ఇందులో భాగం కావాలని నేను ఎదురు చూస్తున్నా. ఆర్సీబీ చాలా సంవత్సరాలుగా ఐపీఎల్లో జనాదరణ పొందిన జట్టు. చాలా మంది ఇష్టపడే జట్టు. ఇప్పుడు ఆర్సీబీ యాజమాన్యం మహిళల ప్రీమియర్ లీగ్ కోసం ఒక జట్టును నిర్మించడాన్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది దేశంలో మహిళల క్రీడలను కొత్త ఎత్తులకు తీసుకువెళుతుంది. కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఆడపిల్లలు, యువతులు క్రీడలను కెరీర్గా ఎంచుకునేలా చేస్తుంది’ అని ఆర్సీబీ విడుదల చేసిన వీడియోలో సానియా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
The pioneer in Indian sports for women, a youth icon, someone who has played Bold and broken barriers throughout her career, and a champion on and off the field. We are proud to welcome Sania Mirza as the mentor of the RCB women’s cricket team. 🤩#PlayBold @MirzaSania pic.twitter.com/eMOMU84lsC
— Royal Challengers Bangalore (@RCBTweets) February 15, 2023
కాగా, ఇప్పటిదాకా అన్ని జట్లకు క్రికెటర్లే మెంటార్లుగా ఉన్నారు. టెన్నిస్లో ఆరు గ్రాండ్స్లామ్లు గెలిచిన సానియా మీర్జా, జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్లో తన చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఆడింది. రోహన్ బోపన్నతో కలిసి మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో రన్నరప్గా నిలిచింది. ఈ నెలలో దుబాయ్ లో జరిగే డబ్ల్యూటీఏ టోర్నీతో ఆమె ఆటకు వీడ్కోలు పలకనుంది. తాజాగా సానియాను ఆర్సీబీ మెంటార్గా నియమించడం పట్ల క్రీడా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆరు గ్రాండ్స్లామ్ల విజేత సానియా మీర్జా ఆర్సీబీ ప్లే బోల్డ్ ఫిలాసఫీకి సరిగ్గా సరిపోతుంది అంటూ చెప్పుకుంటున్నారు.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) త్వరలోనే ప్రారంభం కానుంది. ముంబైలో సోమవారం వేలం ప్రక్రియ ముగియడంతో డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. తొలి మ్యాచ్లో ఏయే జట్లు తలపడనున్నాయో వెల్లడించింది. మార్చి 4న ముంబైలో అట్టహాసంగా డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్ ప్రారంభం కానుంది. 23 రోజుల వ్యవధిలో ఐదు జట్లు 20 లీగ్ మ్యాచ్లు, రెండు ప్లే ఆఫ్ మ్యాచ్లు ఆడనున్నాయి. మార్చి 26న ఫైనల్ నిర్వహిస్తారు.