అడిలైడ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ అడిలైడ్ ఇంటర్నేషనల్ టోర్నీలో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్స్లామ్కు ముందు జరుగుతున్న డబ్ల్యూటీఏ-500 మహిళల డబుల్స్లో గురువారం సానియా-నదియా కిచెనోక్ (ఉక్రెయిన్) జోడీ 6-0, 1-6, 10-5తో షెల్బీ రోజెర్స్ (అమెరికా)-హీథెర్ వాట్సన్ (బ్రిటన్) జంటపై విజయం సాధించింది. శుక్రవారం జరుగనున్న సెమీస్లో ఆష్లే బార్టీ-స్ట్రోమ్ సాండర్స్ (ఆస్ట్రేలియా)తో సానియా జంట అమీతుమీ తేల్చుకోనుంది.