Sania Mirza | భారత టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. మాలిక్తో బ్రేకప్ చెప్పేందుకు సానియా సిద్ధమైనట్లు టాక్ వినిపించింది. ఈ స్టార్ జంట విడిపోయారని, ఇద్దరూ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారంటూ పాకిస్థాన్ మీడియా సైతం ప్రచారం చేసింది. ఓ పాకిస్థాన్ మోడల్ కారణంగా వీరిమధ్య విభేదాలు తలెత్తాయంటూ అక్కడి మీడియా పేర్కొంది. ఈ వార్తలపై అటు మాలిక్ గానీ, సానియా గానీ ఇప్పటి వరకు స్పందించలేదు.
విడాకుల విషయంలో త్వరలోనే అధికారికంగా క్లారిటీ ఇవ్వబోతున్నారు అని టాక్ నడుస్తున్న తరుణంలో… తాజాగా ఈ జంట అభిమానులకు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఇద్దరూ కలిసి ఓ టాక్షో చేయనున్నట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ పాకిస్థానీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉర్దూప్లె్క్స్లో ‘మీర్జా మాలిక్’ షోలో ఈ జంట కలిసి నటిస్తున్నట్లు సమాచారం. ఈ షో కపిల్ శర్మ టాక్ షో తరహాలోనే ఉంటుందని.. ఇందులో వీరిద్దరూ కలిసి హోస్ట్గా చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. ఇందుకు సంబంధించి ఉర్దూప్లెక్స్ అఫిషియల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్గా మారింది.
దాయాదిదేశమైన పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం 2010లో హైదరాబాద్లో అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ జంటకు 2018లో కుమారుడు జన్మించాడు.