హైదరాబాద్, ఆట ప్రతినిధి: రువాండ వేదికగా జరుగుతున్న వరల్డ్ టూర్ టెన్నిస్ ఐటీఎఫ్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ సాయికార్తీక్రెడ్డి ప్రిక్వార్టర్స్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్లో కుల్దీప్ 6-3, 6-4తేడాతో అర్జున్ మహదేవన్పై అద్భుత విజయం సాధించాడు. ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన కార్తీక్..బ్యాక్హ్యాండ్, ఫోర్హ్యాండ్ షాట్లతో చెలరేగుతూ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేశాడు.