ముంబై : ప్రస్తుతం వన్డే క్రికెట్లో బ్యాటర్లకే ప్రాధాన్యం ఉందని, బ్యాట్కు-బంతికి సమప్రాధాన్యం ఉండేలా చూడాలని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. అలాగే టెస్టు క్రికెట్పట్ల ఆసక్తి పెరగాలంటే అన్ని రకాల పిచ్లపై మ్యాచ్లు ఆడించాలన్నాడు. టి20లకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో అభిమానులు కూడా వన్డే క్రికెట్కు కాలం చెల్లిందన్న అభిప్రాయంలో ఉన్నారన్నాడు. వన్డే క్రికెట్ కొనసాగాలంటే బ్యాట్కు-బంతికి సమప్రాధాన్యం ఉండేలా చొరవ చూపాలన్నాడు.