Sachin Tendulkar : భారత జట్టు వన్డే వరల్డ్ కప్(ODI WC) ముద్దాడి నేటికి 40 ఏళ్లు. సరిగ్గా ఇదే రోజు 1983న కపిల్ దేవ్(Kapil Dev) సారథ్యంలోని టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) ఆ రోజుతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు. వరల్డ్ కప్ విజేతల ఫొటోను ట్విట్టర్లో పెట్టిన మాస్టర్ బ్లాస్టర్ వాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ’40 ఏళ్ల క్రితం భారత జట్టు మొదటిసారి వరల్డ్ కప్ గెలిచింది. భారత క్రికెట్తో పాటు నా జీవితాన్ని మార్చేసిన గొప్ప క్షణాల్లో
1983 జూన్ 25 ఒకటి. అందుకని ఆ చాంపియన్ జట్టులోని వీరులకు అభినందనలు తెలియజేస్తున్నా’ అని సచిన్ తన ట్వీట్లో రాశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ‘క్రికెట్ గాడ్’గా పేరొందిన సచిన్ 2013 నవంబర్ 16న ఆటకు అల్విదా పలికాడు. వంద సెంచరీలతో రికార్డు నెలకొల్పిన ఈ దిగ్గజం ఆ తర్వాత ఐపీఎల్(IPL)లో మెరపులు మెరిపించాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్(Mumbain Indians) మెంటర్గా కొనసాగుతున్నాడు.
40 years to India winning the World Cup for the first time! 25th June, 1983 was one of the defining moments that changed Indian cricket as well as my life forever. Paying tribute to all the members of that champion team. pic.twitter.com/ges194UAX1
— Sachin Tendulkar (@sachin_rt) June 25, 2023
హర్యానా హరికేన్ కపిల్ దేవ్ 1983 వరల్డ్ కప్లో తన జట్టుతో అద్భుతం చేశాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత్ను చాంపియన్గా నిలబెట్టాడు. అవును.. అతను సెమీఫైనల్లో 175 పరగులతో జింబాబ్వేపై చెలరేగకుంటేన భారత జట్టు ఫైనల్ చేరేదే కాదు. సంచలన బ్యాటింగ్తో కపిల్ ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపాడు. అందరూ సమిష్టిగా రాణించడంతో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్(Westindies)ను ఫైనల్లో టీమిండియా ఓడించింది.
వందో సెంచరీ కొట్టాక సచిన్ అభివాదం
మొదట ఆడిన భారత్ 183 పరుగులకు ఆలౌటయ్యింది. ఇక విండీస్దే కప్పు అనుకున్నారంతా. కానీ, మదన్లాల్, మహిందర్ అమర్నాథ్ మూడేసి వికెట్లతో కరీబియన్ జట్టను దెబ్బకొట్టారు. దాంతో, ఆ జట్టు 140 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా 43 రన్స్ తేడాతో గెలిచి విశ్వవిజేతగా అవతరించింది. ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న అమర్నాథ్(26 పరుగులు, 3 వికెట్లు)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.