ముంబై: సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోనీ..భారత క్రికెట్ దిగ్గజాలు. దేశానికి ఈ ఇద్దరు క్రికెటర్లు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. అయితే కెరీర్ తొలినాళ్లలో ధోనీ బ్యాటింగ్ స్టయిల్ను మాస్టర్ ఫిదా అయిపోయాడట. ఈ విషయాన్ని సచిన్ తాజాగా పంచుకున్నాడు.
2004 బంగ్లాదేశ్తో సిరీస్ సందర్భంగా ధోనీ షాట్లు చూసి తాను ఆశ్చర్యానికి గురైనట్లు సచిన్ చెప్పుకొచ్చాడు. దీనికి తోడు 2007లో తనకు వచ్చిన కెప్టెన్సీ అవకాశాన్ని వదులుకున్న సచిన్..సెలెక్టర్లకు ధోనీ పేరును సూచించాడట. మాస్టర్ మాటకు కట్టుబడ్డ సెలెక్టర్లు 2007 టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టుకు ధోనీని కెప్టెన్గా నియమించింది.