ముంబై: టీమిండియా మాజీ బ్యాటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ టోర్నీలో ఆడిన తొలి తండ్రీ కొడుకులుగా రికార్డుల్లోకి ఎక్కారు. ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్ టీమ్తో జరిగిన మ్యాచ్లో అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ఇవాళ్టి మ్యాచ్కు తుది 11 మందిలో ముంబై అర్జున్ టెండూల్కర్కు చోటు కల్పించింది.
దాంతో ఐపీఎల్ మ్యాచ్ ఆడేందుకు రెండేళ్లుగా ఎదురుచూస్తున్న అర్జున్ కల ఫలించింది. వాస్తవానికి ముంబై ఇండియన్స్ టీమ్ 2021 ఐపీఎల్ సీజన్లోనే అర్జున్ టెండూల్కర్ను జట్టులోకి తీసుకుంది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. 2022లో కూడా అర్జున్ను రిజర్వ్ బెంచ్కే పరిమితం చేసింది. ఈ సీజన్లో కూడా తొలి మూడు మ్యాచ్లకు అర్జున్ను ఆడించలేదు. ఈ మ్యాచ్లో అనూహ్యంగా ఫైనల్ 11లోకి సెలెక్ట్ చేసింది.
కాగా, మాస్టార్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 2008 నుంచి 2013 వరకు వరుసగా 6 సీజన్లలో ముంబై ఇండియన్స్ టీమ్కు ఆడాడు. మొత్తం ఆరు సీజన్లలో కలిపి 78 మ్యాచ్లు ఆడిన సచిన్ 2,334 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు అర్జున్ టెండూల్కర్ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.