Pat Cummins : భారత జట్టు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలో తాను కోహ్లీకే ఓటేస్తానని ఆసీస్ టెస్టు జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. సహచర ఆటగాడు ఉస్మాన్ ఖవాజా, అతని మధ్య తాజాగా సరదా సంభాషణ జరిగింది. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ.. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకో అని ఖవాజా అనగానే కోహ్లీ అని కమిన్స్ బదులిచ్చాడు. ‘సచిన్తో కొన్నేండ్ల క్రితం ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడాను. అందుకని నేను విరాట్ కోహ్లీని ఎంచుకున్నా’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఖవాజాను ఆస్ట్రేలియా జట్టుకోసం ఇద్దరు భారత ఆటగాళ్లను సెలక్ట్ చేయి అని కమిన్స్ అడిగాడు. అందుకు అతను కోహ్లీ, రిషభ్ పంత్ పేర్లు చెప్తాడు. ఆసీస్ జట్టు ఫిబ్రవరిలో భారత పర్యటనకు రానుంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 4 టెస్టులు ఆడనుంది. ఫిబ్రవరి 9న నాగ్పూర్లో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్లో కమిన్స్, కోహ్లీ మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. డబ్ల్యూటీసి ఫైనల్ బెర్తు దక్కాలంటే ఈ సిరీస్లో భారత్ గెలిచి తీరాలి.
సచిన్ రికార్డుకు చేరువలో..
సచిన్, కోహ్లీలో ఎవరు ఉత్తమ ఆటగాడు అనే విషయంపై కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. ఛేజింగ్ రారాజుగా పేరొందిన కింగ్ కోహ్లీ వన్డేల్లో 45వ శతకం సాధించాడు. అంతేకాదు సచిన్ వంద సెంచరీల రికార్డుకు చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 74 శతకాలు ఉన్నాయి. మరో 26 సెంచరీలు చేస్తే సచిన్ రికార్డు సమం చేస్తాడు. గత ఏడాది ఆసియా కప్లో ఫామ్ అందుకున్న కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. ఆకలిగొన్న పులిలా సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు. ఆసియాకప్లో సెంచరీ, ఆ తర్వాత బంగ్లా సిరీస్లోనూ వంద రన్స్ బాదాడు. స్వదేశంలో జరిగిన శ్రీలంక సిరీస్లో మొదటి వన్డేలో (116), మూడో వన్డేల్లో (166) కోహ్లీ శతకాలతో చెలరేగాడు.