యువప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ (101) సెంచరీతో అదరగొట్టడంతో రాజస్థాన్తో జరగుతున్న మ్యాచ్లో చెన్నై జట్టు పటిష్ఠస్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టుకు గైక్వాడ్, డుప్లెసిస్ (25) మంచి ఆరంభాన్నిచ్చారు. మరోసారి సురేష్ రైనా (౩) ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మొయీన్ అలీ (21) పర్వాలేదనిపించగా, అంబటి రాయుడు (2) కూడా నిరాశపరిచాడు.
అయితే చివర్లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 32) బ్యాటు ఝుళిపించాడు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ తెవాటియా ౩ వికెట్లు పడగొట్టగా, చేతన్ సకారియా ఒక వికెట్ దక్కించుకున్నాడు.