త్వరలోనే సౌతాఫ్రికా సిరీస్కు వెళ్లబోయే టెస్టు సిరీస్కు టీమిండియా జట్టు ఖరారైంది. కానీ వన్డే జట్టు ఎంపిక ఇంకా చేయాల్సి ఉంది. భారత్లో జరగబోయే విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ తర్వాత వన్డే జట్టు ఎంపిక జరగనుందని సమాచారం. కానీ ఇంతవరకు టీమిండియా జట్టుకు భారీ ఓపెనింగ్ చేసే శిఖర్ ధవన్ ఈ మధ్య తన ఆటతీరుతో అంతగా మెప్పించలేకపోతున్నాడు.
ధవన్ గత నాలుగు సీరీస్లను చూస్తే 18, 14, 12, 0 పరుగులు మాత్రమే చేసి నిరాశపరుస్తే. . మరోవైపు యువ ఆటగాళ్లు వేగంగా, భారీ స్కోరు చేస్తున్నారు.
యువ ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటివరకు విజయ్ హజారే ట్రోఫీలో మూడు సెంచురీలు కొట్టాడు. గైక్వాడ్తో పాటు వెంకటేష్ అయ్యర్ కూడా అద్భుత ఫాంలో ఉన్నాడు. అతను చివరి మూడు ఇన్నింగ్స్లో రెండు సెంచురీలు సాధించాడు. వీరిద్దరే కాకుండా కె యస్ భరత్ కూడా 109 బంతుల్లో 161 పరుగులు బాదాడు. న్యూజిల్యాండ్తో జరిగిన టెస్టు సీరీస్లో భరత్ తన వికెట్ కీపింగ్తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.
వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్తో పాటు మంచి మీడియం పేసర్ కూడా.. ఇలా ఒక ఆల్రౌండర్ ఉపయోగపడే వెంకటేష్ అయ్యర్కు చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జట్టులో ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కూడా లేడు.
ఈ ముగ్గురు యువ ఆటగాళ్లు తమ ఆటతీరుతో సౌతాఫ్రికా సిరీస్కు వెళ్లే వన్డే టీమిండియా జట్టులో స్థానం కోసం గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తన బ్యాట్తో మెప్పించలేని శిఖర్ ధవన్కు చోటు దక్కడం కష్టమే.