హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర యువ టెన్నిస్ ప్లేయర్ సాయిదేదీప్య ఏఐటీఏ మహిళల టోర్నీలో రన్నరప్గా నిలిచింది.
శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో యువ ప్లేయర్ సాయిదేదీప్య-అనూష కొండవీటి జంట 4-6, 4-6తో సందీప్తి-బేలా తమాన్కర్ ద్వయం చేతిలో ఓటమి పాలైంది. టోర్నీ ఆసాంతం చక్కటి ప్రదర్శన కనబర్చిన ఈ తెలుగు జోడీ.. తుదిపోరులో అదే స్థాయిలో రాణించలేకపోయింది.