ఢిల్లీ : నిరుడు ముంబైలో విజయవంతంగా నిర్వహించిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్బీఎల్) రెండో సీజన్ ఈసారి హైదరాబాద్లో జరుగనుంది. ఈ ఏడాది జూన్ 16 నుంచి 28 వరకు గచ్చిబౌలి స్టేడియం వేదికగా రెండో సీజన్ను నిర్వహించనున్నట్టు రగ్బీ ఇండియా సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
జీఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆర్బీఎల్ను దేశమంతటా విస్తరించే ప్రణాళికలో భాగంగానే ఈ సీజన్కు హైదరాబాద్ వేదిక కానుంది. నిరుడు మాదిరిగానే 2026లోనూ ఆరు జట్లు తలపడనున్న ఈ టోర్నీ రగ్బీ 7ఎస్ ఫార్మాట్లో జరుగుతుంది.