ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన యువ అథ్లెట్ అగసర నందినికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ప్రోత్సహకాన్ని అందించింది. మంగళవారం ధర్మపురిలో నిర్వహించిన బహిరంగ సభా వేదికపై మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ నందినికి చెక్కు అందజేశారు.
ఏడు క్రీడాంశాల సమాహారమైన హెప్టాథ్లాన్లో సత్తాచాటి రాష్ర్టానికి, దేశానికి గర్వకారణంగా నిలిచిన నందినిని మంత్రులు ప్రత్యేకంగా అభినందించారు.