బెంగళూరు బౌలింగ్ దాడి ముందు రాజస్థాన్ బ్యాటింగ్ విలవిల్లాడుతోంది. ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ (4) వికెట్ పతనంతో ప్రారంభమైన రాజస్థాన్ ఇన్నింగ్స్ను.. బట్లర్ (34 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (37) నిలబెట్టారు. అయితే హర్షల్ పటేల్.. పడిక్కల్ను అవుట్ చేయడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ (8) నిరాశ పరిచాడు.
హసరంగ వేసిన బంతిని సింపుల్గా మళ్లీ అతనికే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. శాంసన్ కూడా అవుటవడంతో హెట్మెయర్ క్రీజులోకి వచ్చాడు. రాజస్థాన్ జట్టు పోరాడగలిగే స్కోరు చేయాలంటే వీళ్లిద్దరూ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది.