బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడే ప్రయత్నంలో కెప్టెన్ సంజూ శాంసన్ (23) పెవిలియన్ చేరాడు. ఓపెనర్ జోస్ బట్లర్ (69 నాటౌట్) అద్భుతంగా ఆడుతున్నాడు. దాంతో రాజస్థాన్ విజయం దాదాపు ఖరారైంది.
అలాంటి పరిస్థితిలో అనవసరంగా భారీ షాట్కు యత్నించిన శాంసన్.. బంతిని మిస్ అయ్యాడు. దాన్ని అందుకున్న దినేష్ కార్తీక్ స్టంపింగ్ చేయడంతో.. శాంసన్ మైదానం వీడాల్సి వచ్చింది. ఈ క్రమంలో 12 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులతో నిలిచింది.