బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ జట్టుకు నెమ్మదైన ఆరంభం లభించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) మరోసారి నిరాశ పరిచాడు. దీంతో క్రిజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ (19 నాటౌట్).. తన మాజీ జట్టు అయిన బెంగళూరుపై జాగ్రత్తగా ఆడుతున్నాడు.
మరో ఓపెనర్, గత మ్యాచులో సెంచరీతో చెలరేగిన జోస్ బట్లర్ (10 నాటౌట్) కూడా నిదానంగా ఆడుతున్నాడు. దీంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు 35/1 స్కోరుతో నిలిచింది. బెంగళూరు బౌలర్లలో డేవిడ్ విల్లే ఒక వికెట్ తీసుకున్నాడు.