రాజస్థాన్తో జరుగుతున్న తొలి క్వాలిఫైయర్లో బెంగళూరు బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. రెండో ఓవర్లోనే కీలకమైన కోహ్లీ (7) వికెట్ కోల్పోయినా.. ఆ తర్వాత వచ్చిన పటీదార్, డుప్లెసిస్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అనవసర షాట్లకు పోకుండా అడపాదడపా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు.
ఈ క్రమంలోనే పవర్ప్లే ముగిసే సరికి బెంగళూరు జట్టు ఒక వికెట్ నష్టానికి 46 పరుగులతో నిలిచింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో అనవసరమైన షాట్కు ప్రయత్నించిన కోహ్లీ వికెట్ పారేసుకున్నాడు.
End of Powerplay!
No shortage of action in the first six overs. 👍 👍@RCBTweets score 46 runs. @rajasthanroyals pick 1 wicket.
Follow the match ▶️ https://t.co/orwLrIaXo3 #TATAIPL | #RRvRCB pic.twitter.com/LR2kdIO0u7
— IndianPremierLeague (@IPL) May 27, 2022