ఏ జట్టులో ఉన్నా తను వికెట్ టేకర్నే అని యుజ్వేంద్ర చాహల్ నిరూపించాడు. తన మాజీ జట్టు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో తొలి వికెట్ తీశాడు. అప్పటి వరకు వికెట్ లేకపోవడంతో టెన్షన్లో ఉన్న రాజస్థాన్ అభిమానులకు ఊరటనిచ్చాడు. చాహల్ వేసిన ఏడో ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డుప్లెసిస్..
నాన్స్ట్రైకర్ తలమీదుగా సిక్సర్ కొట్టాలని అనుకున్నాడు. కానీ బంతిని అంచనా వేయడంలో జరిగిన పొరపాటుతో మిస్టైం చేశాడు. దాంతో బంతి ఎక్కువ దూరం వెళ్లలేదు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బౌల్ట్.. వేగంగా వచ్చి క్యాచ్ ఫినిష్ చేయడంతో డుప్లెసిస్ వెనుతిరిగాడు. రాజస్థాన్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఏడు ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు 55/1 స్కోరుతో నిలిచింది.