లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటింగ్ పడి లేచింది. ఆరంభంలో అద్భుతంగా ఆడిన రాజస్థాన్ బ్యాటర్లు తర్వాత చతికిలపడిపోయారు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. బట్లర్ (13), శాంసన్ (13) రాసీ వాన్ డర్ డస్సెన్ (4) నిరాశపరచగా.. ఓపెనర్గా వచ్చిన దేవదత్ పడిక్కల్ (29) ఫర్వాలేదనిపించాడు. అయితే వీళ్లంతా వెంటవెంటనే అవుటవడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది.
అయితే చివర్లో హెట్మెయర్ (59 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్తోపాటు అశ్విన్ (28) రాణించారు. ఇలాంటి సమయంలో అశ్విన్ రిటైర్డ్ అవుట్గా వెనుతిరిగాడు. తర్వాత కాసేపటికే రియాన్ పరాగ్ (8) కూడా అవుటయ్యాడు. చివరి బంతికి ట్రెంట్ బౌల్ట్ (2 నాటౌట్) రెండు పరుగులు తీయడంతో రాజస్థాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. లక్నో ముందు పోరాడగలిగే లక్ష్యాన్ని నిలిపింది.