ఆరంభంలో అద్భుతంగా ఆడిన రాజస్థాన్ బ్యాటర్లు తర్వాత చతికిలపడిపోయారు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. బట్లర్ (13), శాంసన్ (13) రాసీ వాన్ డర్ డస్సెన్ (4) నిరాశపరచగా.. ఓపెనర్గా వచ్చిన దేవదత్ పడిక్కల్ (29) ఫర్వాలేదనిపించాడు. అయితే వీళ్లంతా చాలా తక్కువ వ్యవధిలోనే వికెట్లు కోల్పోవడంతో.. ఆ జట్టు ఇబ్బందుల్లో పడింది.
తర్వాత బ్యాటింగ్కు వచ్చిన హెట్మెయర్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. అతనికి జత కలిసిన రవిచంద్రన్ అశ్విన్ (15 నాటౌట్) కూడా నిదానంగా ఆడుతున్నాడు. దాంతో 15 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.