రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో జట్టు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఫామ్లో ఉన్న కెప్టెన్ కేఎల్ రాహుల్ (0) వికెట్ కోల్పోయిన లక్నో.. ఆ తర్వాతి లీగల్ డెలివరీకే కృష్ణప్ప గౌతమ్ (0) వికెట్ పోగొట్టుకుంది. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన జేసన్ హోల్డర్ (8) కాసేపు నిలబడ్డాడు.
అయితే ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి అవుటయ్యాడు. కృష్ణ వేసిన బంతిని పుల్ చేయడానికి హోల్డర్ ప్రయత్నించాడు. కానీ బ్యాటు పొజిషనింగ్ సరిగా లేకపోవడంతో గాల్లోకి ఎత్తుగా లేచిన బంతిని అశ్విన్ సులభంగా అందుకున్నాడు. దాంతో హోల్డర్ నిరాశగా మైదానం వీడాడు. దీంతో 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన లక్నో కష్టాల్లో పడింది.