రాజస్థాన్ రాయల్స్పై అద్భుత విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. తాము ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉన్నామని చాటి చెప్పింది. బ్యాటింగ్ కష్టంగా ఉన్న పిచ్పై మిచెల్ మార్ష్ (89) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి డేవిడ్ వార్నర్ (52 నాటౌట్) చక్కని సహకారం అందించాడు. వీళ్లిద్దరూ రాణించడంతో 160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు 18.1 ఓవర్లలోనే ఛేదించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ అశ్విన్ (50), పడిక్కల్ (48) రాణించడంతో 160 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో తొలి ఓవర్లోనే భరత్ (0) అవుటవడంతో ఢిల్లీ జట్టు ఇబ్బందుల్లో పడుతుందని అనిపించింది. అయితే మార్ష్, వార్నర్ ఇద్దరూ అనవసరమైన షాట్లకు పోకుండా ఆచి తూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు. దాదాపు విజయం ఖాయమైన సమయంలో మార్ష్ పెవిలియన్ చేరాడు. అప్పుడే క్రీజులోకి వచ్చిన పంత్ (13 నాటౌట్) కూడా రెండు సిక్సర్లు బాదాడు.
దీంతో చివరి రెండు ఓవర్లలో 3 పరుగులు కావలసి ఉంది. ఇలాంటి సమయంలో తను ఎదుర్కొన్న తొలి బంతికే వార్నర్ మూడు పరుగులు తీశాడు. అసలు బౌండరీ వెళ్లాల్సింది కానీ.. పరాగ్ అద్భుతమైన ఫీల్డింగ్తో ఆ బంతికి మూడు పరుగులే వచ్చాయి. దీంతో వార్నర్ అర్ధశతకం పూర్తయింది. అలాగే ఢిల్లీ జట్టు ఆరు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయి.
FIFTY!
A well made half-century by @davidwarner31 💪👏https://t.co/EA3RTz0tWQ #RRvDC #TATAIPL pic.twitter.com/2WeehObALs
— IndianPremierLeague (@IPL) May 11, 2022
FIFTY for Mitchell Marsh 👏👏
His maiden half-century in #TATAIPL
Live – https://t.co/EjuBD7GvtW #RRvDC #TATAIPL pic.twitter.com/jtXkUSsfhM
— IndianPremierLeague (@IPL) May 11, 2022