రాజస్థాన్ ఇన్నింగ్స్ను నిలబెట్టిన రవిచంద్రన్ అశ్విన్ (50) అవుటయ్యాడు. సూపర్ ఫామ్లో ఉన్న జోస్ బట్లర్ (7) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరడంతో.. ఇన్నింగ్స్ నిర్మించడానికి క్రీజులోకి వచ్చిన అశ్విన్ తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే అర్ధశతకం పూర్తయిన వెంటనే మార్ష్ బౌలింగ్లో అవుటయ్యాడు.
టైమింగ్ సరిగా కుదరక పోవడంతో అతను కొట్టిన బంతి గాల్లోకి ఎత్తుగా లేచింది. ఎక్స్ట్రా కవర్లో ఉన్న వార్నర్ పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని అందుకోవడంతో అశ్విన్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో 107 పరుగుల వద్ద రాజస్థాన్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది.