కరోనా కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. లీగ్ను అర్ధంతరంగా నిలిపివేయడంతో విదేశీ ఆటగాళ్లు తమ ఇళ్లకు వెళ్తున్నారు.
తాజాగా బంగ్లాదేశ్ సూపర్స్టార్స్ ముస్తాఫిజుర్ రెహమాన్, షకీబ్ అల్ హసన్ సురక్షితంగా తిరిగి తమ దేశానికి చేరుకున్నారు. ఐపీఎల్లో ముస్తాఫిజుర్ రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, షకీబ్.. కోల్కతా నైట్రైడర్స్కు ఆడుతున్నాడు. రెండు ఫ్రాంఛైజీలు ప్రత్యేక విమానాన్ని
ఏర్పాటు చేసి స్వదేశానికి పంపించారు. విమానంలో ఉండగా దిగిన సెల్ఫీని ముస్తాఫిజుర్ సోషల్మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మేమంతా సురక్షితంగా బంగ్లాదేశ్ చేరుకున్నట్లు ముస్తాఫిజుర్ ట్వీట్ చేశాడు.