RCB vs MI | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఆర్సీబీ ప్లేఆఫ్స్కు దూసుకెళ్లింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబైని చిత్తు చేసింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు వచ్చిన ముంబై ఇండియన్స్ను ఆర్సీబీ బౌలర్లు చెమటలు పెట్టించారు. వాళ్ల ధాటికి ముంబై బ్యాటర్స్లో మాథ్యూస్ (26), సజన (30)లు కలిసి మాత్రమే రాణించగా.. మిగిలినవారంతా విఫలమయ్యారు. ముఖ్యంగా ఆ జట్టు ఆల్రౌండర్ ఎలీస్ పెర్రీ ఆరు వికెట్ల (6/15) తో చెలరేగడంతో ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది. పెర్రీ ధాటికి ఒక దశలో 64-1గా ఉన్న ముంబై ఇండియన్స్.. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికీ 82-7గా మారింది. 5 ఓవర్ల వ్యవధిలో ముంబై ఆరు వికెట్లు కోల్పోయింది. పెర్రీ వరుస ఓవర్లలో ముంబైని నిండా ముంచింది.
అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు బ్యాటర్లు 15 ఓవర్లలోనే టార్గెట్ను ఛేదించారు. కెప్టెన్ స్మృతి మంధన్నా 11 పరుగులకే పరిమితమైనప్పటికీ ఎలిస్ ఫెర్రీ (40*), రిచా ఘోష్ (36 *) రాణించారు. దీంతో ఆర్సీబీ ప్లేఆఫ్కు చేరుకుంది.